బాల సాహిత్యమే మనోవికాసానికి మూలం

Spread the love

చిట్యాల సాక్షిత ప్రతినిధి

బాల సాహిత్యం విద్యార్థుల మేధో వికాసానికి దోహద మవుతుందని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య అన్నారు. చిట్యాల మండలం లోని వట్టిమర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డాక్టర్ ఎం.పురుషోత్తమాచార్య రచించిన వెన్నెల కుప్పలు పిల్లల పాటల పుస్తక ఆవిష్కరణ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు డోకూరి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల పదవ తరగతి విద్యార్థిని వెన్నపూసల భవ్య వెన్నెల కుప్పలు గ్రంథాన్ని ఆవిష్కరించారు. పాఠశాల పూర్వ విద్యార్థి రచయిత సాగర్ల సత్తయ్య పుస్తకాన్ని సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రచయిత పెరుమాళ్ళ ఆనంద్, పొట్ట బత్తుల రామకృష్ణ, ఎన్ యాదయ్య, డి సూర్య ప్రకాష్ ఎం నీరజ, బిఆర్ రాజు, శీలం మధుసూదన్, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page