హరినాథ్ రావు దశదిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు

Spread the love

Chief Minister K. Chandrasekhar Rao in the ritual program of Harinath Rao Dasaday

హైదరాబాద్ లో తన వియ్యంకుడు, మంత్రి కేటీఆర్ మామగారైన దివంగత పాకాల హరినాథ్ రావు దశదిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దివంగత హరినాథ్ రావు చిత్రపటానికి సీఎం పుష్పాంజలి ఘటించారు. దివంగత హరినాథ్ కుమార్తె శ్రీమతి శైలిమ (మంత్రి కేటీఆర్ భార్య), కుమారులు రాజ్ పాకాల, శైలేంద్ర పాకాలను, ఇతర కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా సీఎం పరామర్శించారు.

ఈ సందర్భంగా తన కుమారుడు మంత్రి కేటీఆర్, మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య ఇతర కుటుంబ సభ్యులతో పాటు, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు మహమూద్ అలి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీమతి సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, మల్లారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్

,

ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, రంజిత్ రెడ్డి, కొత్తా ప్రభాకర్ రెడ్డి, వెంకటేశ్ నేత, బిబి పాటిల్, శ్రీమతి కవితా నాయక్, ఎమ్మెల్సీలు మధుసూధనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, బస్వరాజు సారయ్య, బండ ప్రకాశ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, లక్ష్మారెడ్డి, కేపీ వివేకానంద, కాలె యాదయ్య, రసమయి బాలకిషన్, క్రాంతి కిరణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, మీడియా అకాడెమీ ఛైర్మన్ అల్లం నారాయణ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page