Former MLA Kuna Srisailam Goud met with Shakti Kendra incharge of Narsapur Constituency…

Spread the love
Former MLA Kuna Srisailam Goud met with Shakti Kendra incharge of Narsapur Constituency...

నర్సాపూర్ నియోజకవర్గ శక్తి కేంద్ర ఇంఛార్జులతో సమావేశమైన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ …


సాక్షిత : ఈ నెల 7వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తో జరగనున్న బూత్ కమిటీ ల సమ్మేళనం కార్యక్రమం నేపథ్యంలో నర్సాపూర్ నియోజకవర్గంలోని నర్సాపూర్ టౌన్, నర్సాపూర్ రూరల్, కొల్చారం మండలాల శక్తి కేంద్ర ఇంఛార్జులతో మాజీ ఎమ్మెల్యే, నర్సాపూర్ అసెంబ్లీ పాలక్ కూన శ్రీశైలం గౌడ్ సమావేశమై,

పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలనీ, సంస్థాగతంగా పార్టీ మరింత పటిష్టంగా ఉంటేనే పార్టీ గెలుపు సాధ్యమవుతుందని, బూత్ సమ్మేళనం జయప్రదం చేయాలనీ అన్నారు.

అనంతరం గొల్లపల్లి గ్రామంలోని కేతకి మల్లికార్జున స్వామి ఆలయంలో స్థానిక బీజేపీ నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ప్రత్యేక పూజలు చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా పదాధికారులు, మండల పదాధికారులు, గ్రామ శాఖ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇంచార్జులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page