బిఆర్ఎస్ పాలనలోనే కుల సంఘాలకు ప్రత్యేక గుర్తింపు

Spread the love

బిఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద కి పూర్తి మద్దతు తెలిపిన రాష్ట్రీయ బసవదళ కుత్బుల్లాపూర్ విభాగం…


సాక్షిత : జీడిమెట్ల గ్రామంలోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద రాష్ట్రీయ బసవదళ సభ్యులు రాష్ట్రీయ బసవదళ కుత్బుల్లాపూర్ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ దెంపే కృష్ణ, సయ్యద్ రషీద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకే మద్దతు ఉంటుందని తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని అన్ని కులాలకు సమ ప్రాధాన్యతనిస్తూ వారి అభ్యున్నతి కోసం స్థలాల కేటాయింపు, భవన నిర్మాణాలకు తోడ్పాటు అందించిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ , ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీయేనన్నారు.

అనంతరం రాష్ట్రీయ బసవదళ అధ్యక్షులు దెంపే కృష్ణ మాట్లాడుతూ జగద్గిరిగుట్ట
నగర్ లోని వీరశైవ లింగాయత్ బసవేశ్వర మందిరం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కేపీ వివేకానంద చేసిన సేవను మర్చిపోలేమని అందుకు కృతజ్ఞతా భావంగా నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో తమ పూర్తి మద్దతు బిఆర్ఎస్ పార్టీకెనన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రుద్రా అశోక్, సీనియర్ నాయకులు రషీద్ భాయ్, ఎత్తరి మారయ్య, రాష్ట్రీయ బసవదళ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 01 At 2.51.01 Pm
Print Friendly, PDF & Email

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page