బీసీ బంధు తో నాయి బ్రాహ్మణులకు స్వయం ఉపాధి కల్పిస్తూ వారికి తోడ్పాటునందించిన ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్

Spread the love

129- సూరారం డివిజన్ లో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో 130- సుభాష్ నగర్ డివిజన్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బలరాం రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కే. పీ. వివేకానంద ని కలిసిన శ్రీ సాయి భవాని నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు నియోజకవర్గంలో గత తొమ్మిదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధికి మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ బీసీ బంధు, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్, వ్యాపార పన్ను లేకుండ వారి అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. మన సంక్షేమం కోసం పనిచేసే బిఆర్ఎస్ పార్టీని మరోమారు భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్ ని హ్యాట్రిక్ సీఎంగా చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు పి. రమేష్ నాయి, ఉపాధ్యక్షులు టి. శంకరయ్య నాయి, ప్రధాన కార్యదర్శి ఎస్. శివకుమార్ నాయి, రామ్ లక్ష్మణ్ నాయి, వెంకటేష్ నాయి, పాండు నాయి, శ్రీకాంత్ నాయి తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 21 At 12.35.43 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page