రాష్ట్ర అవతరణతో అవధులు లేని అభివృద్ధి

Spread the love

సాక్షిత : *తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు . వినోద్ కుమార్ , జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి సునితా మహేందర్ రెడ్డి , వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ , కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి , పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మొదటగా ముఖ్య అతిథులు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు, ఎమ్మెల్యే దంపతులు వారిని సన్మానించి, శ్రీ అనంతపద్మనాభ స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు.

అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి, పోలీస్ వారి గౌరవ వందనాన్ని స్వీకరించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రత్యేక తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన తెలంగాణ అమరవీరులు కీ.శే లు యాదయ్య , దీపక్ , మేశేట్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ… వారిని సన్మానిస్తూ అమరవీరులను స్మరించుకున్నారు.
విద్యార్థులు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి, వారికి బహుమతులు అందజేశారు.
అనంతరం వివిధ శాఖల వారు ఏర్పాటు చేసిన సంక్షేమ ప్రదర్శనలను తిలకించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ , జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి , SP కోటి రెడ్డి , ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page