పోలింగ్ బూత్ స్థాయి బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జీలతో బోయినపల్లి వినోద్ కుమార్ సమావేశం

Spread the love

వేములవాడ అర్బన్, రూరల్ మండలాల పోలింగ్ బూత్ స్థాయి బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జీలతో బోయినపల్లి వినోద్ కుమార్ సమావేశం
అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై పలు సూచనలు చేసిన వినోద్ కుమార్

సాక్షిత : వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వేములవాడ అర్బన్, రూరల్ మండలాల పోలింగ్ బూత్ స్థాయి బీ ఆర్ ఎస్ పార్టీ కమిటీ ఇన్చార్జిలతో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సమావేశమయ్యారు.
వేములవాడ పట్టణంలోని అసెంబ్లీ ఎన్నికల బీ ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మేడ లక్ష్మీ నరసింహారావు ఎన్నికల కార్యాలయంలో వేములవాడ అర్బన్, రూరల్ మండలాల ఈ సమావేశంలో పోలింగ్ బూత్ స్థాయి ఇన్చార్జీలకు పోలింగ్ సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలు, విధివిధానాలు, బాధ్యతలను వినోద్ కుమార్ వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి వెళ్లి ప్రజలకు మరోసారి గుర్తుచేయాలని వినోద్ కుమార్ సూచించారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బి.ఆర్.ఎస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు సవివరంగా వివరించాలని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి మెంబర్లు రవి, ఆశావాణీ తిరుపతి, ఎంపీపీలు వజ్రవ్వ బాబు, మల్లేశం, సెస్ డైరెక్టర్లు హరిచరన్ రావు, దేవ రాజం, పార్టీ మండల అధ్యక్షులు రవి, ప్రవీణ్, బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఆరేపల్లి రాజేందర్, జోగినపల్లి అజిత్ రావు, పోలింగ్ బూత్ ఇంచార్జీలు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 11 At 6.32.02 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page