పేట్ బషీరాబాద్ లోని జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తో కలిసి పరిశీలించిన బీజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్

Spread the love

సాక్షిత : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేట్ బషీరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీ (JNJMACHS) స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ , మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావ్ తో కలిసి సందర్శించారు. తమకు కేటాయించిన స్థలాన్ని బండి సంజయ్ కి, కూన శ్రీశైలం గౌడ్ కి చూపించిన జర్నలిస్టులు, ప్రభుత్వం ఆ స్థలాన్ని అప్పగించక పోవడంతో జరుగుతున్న ఆక్రమణలను చూపించారు.ఆ స్థలాన్ని కలియదిరిగిన బండి సంజయ్ , కూన శ్రీశైలం గౌడ్ అక్కడే ఉన్న కట్ట మైసమ్మ అమ్మ వారి ఆలయాన్ని దర్శించుకున్నారు.అనంతరం బండి సంజయ్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి, పటోళ్ల విక్రం రెడ్డి, బిజెపి అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి తదితర నేతలు, జర్నలిస్టులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page