నోట్ బుక్స్, గడియారం & గొడుగులు పంపిణీ చేసిన బీజేపీ నాయకుడు, కేకేఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్

Spread the love

జగద్గిరిగుట్ట జెడ్పి హైస్కూల్, ఎంపిపిఎస్ విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం & గొడుగులు పంపిణీ చేసిన బీజేపీ నాయకుడు, కేకేఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ …

కష్టపడి చదివే ప్రతి విద్యార్థికి తాను అండగా ఉంటా..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ఆదేశాల మేరకు కేకేఎం ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా జగద్గిరిగుట్ట జిల్లా పరిషత్ హైస్కూల్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో l బీజేపీ నాయకుడు, ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ సుమారు 1500 మంది విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం, గొడుగులతో కూడిన కిట్లను పంపిణీ చేసారు.

ఈ సందర్బంగా బీజేపీ నేత, కేకేఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తన సోదరులు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ , కూన జై కుమార్ గౌడ్ సహకారంతో కేకేఎం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టామని, అందులో భాగంగానే పేద విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. గతంలో పేద విద్యార్థుల కు పుస్తకాలు పంపిణీ చేశామని అన్నారు. పేద విద్యార్థులకు తాను ఎప్పుడు అండగా ఉంటానని తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పంపిణీ చేస్తామని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని, జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జెకె శేఖర్ యాదవ్, బిజెపి డివిజన్ అధ్యక్షులు పున్నారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మేకల సురేష్ రెడ్డి, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అరకల సుధా, నాయకులు సిద్ధిరాంరెడ్డి, అరుణ రెడ్డి, మహేందర్, నరేష్ గౌడ్, నందికంటి శ్రవణ్, మాధవులు, పడాల సత్యనారాయణ, పరశురామ్, గండి రాజు యాదవ్, జగన్, మణికంఠ, నాగరాజు, ముప్పిడి రవి, కేకేఎం ట్రస్ట్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page