వైసీపీకి భారీ షాక్

Spread the love

వైసిపి ప్రధాన కార్యదర్శి టిడిపిలో చేరిక

రాష్ట్ర వైఎస్ఆర్సిపి పార్టీకి ఎదురు గాలులు వీస్తున్నాయని వైసీపీ నాయకులంతా వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని అలాగే వైసీపీ ప్రధాన కార్యదర్శి , రాష్ట్ర బిల్డర్ అసోసియేషన్ అధ్యక్షుడు , ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బిందెల సుదర్శన్ మాజీ మంత్రివర్యులు నంద్యాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో టిడిపిలో చేరడం జరిగింది వారికి టిడిపి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఫరూక్

ఈ సందర్భంగా ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సిపి పార్టీని నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరని వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందుకు ప్రజలను మభ్యపెట్టి పథకాల మీద పథకాలు హామీల మీద హామీలు కురిపించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని విస్వరించి నాయకులను కార్యకర్తలను విస్మరించిన పార్టీ ఏదైనా ఉందంటే అదొక వైసీపీ పార్టీ అన్నారు కాబట్టి వైసిపి నాయకులు తెలుసుకొని ఈరోజు టిడిపి వైపు రావడం చాలా సంతోషంగా ఉందని రాబోయే ఎలక్షన్లలో టిడిపి రాష్ట్రవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించబోతుందన్నారు అలాగే నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న ఏడు ఎమ్మెల్యే సీట్లు , ఒక ఎంపీ సీటు భారీ మెజారిటీతో గెలవబోతున్నామన్నారు . ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వాకా శివశంకర్ యాదవ్ పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page