ప్రొఫెసర్ జయశంకర్ సార్ 12 వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన భౌరంపేట్ గ్రామ నాయకులు..

Spread the love

దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ గ్రామంలో స్థానిక PACS చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ నాయకులు తెలంగాణ స్వరాష్ట్ర పోరాట యోధుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ప్రొఫెసర్ గా కెసిఆర్ సార్ కి ఆప్తుడుగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారని గుర్తు చేశారు.

తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ, రాష్ట్రం ఎందుకు అవసరమో అవగాహన కల్పిస్తూ ఉద్యమాన్ని ఏకతాటిపైకి నడిపించిన ఉద్యమకారుడు జయశంకర్ సార్ అని అభివర్ణించారు. నాలుగు దశాబ్దాలు ఉద్యమాన్ని సజీవంగా ఉంచడంలో గొప్ప పాత్ర పోషించారన్నారు. శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను బలంగా బల్లగుద్ది చెప్పిన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , నాయకులు మురళీ యాదవ్ , విష్ణువర్ధన్ రెడ్డి మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page