ఆయిమాత ఆలయ 19వ వార్షకోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే కె.పి.వివేకానంద ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు

Spread the love

ఆయిమాత ఆలయ 19వ వార్షకోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే కె.పి.వివేకానంద ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130- సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్ పైపులైన్ రోడ్డులో కొలువై ఉన్న మార్వాడి సమాజం వారి ఆయిమాతా ఆలయ 19వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి, ఈ కార్యక్రమానికి ఎమ్మేల్యే కే.పి.వివేకానంద ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు..

ఈ సంద్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ
ఆధ్యాత్మిక చింతనలోనే మనస్సుకు ప్రశాంతత చేకూరుతుందని, నేటి యాంత్రిక జీవన విధానంలో మనిషికి శారీరకంగా మరియు మానసికంగా ప్రశాంతత కేవలం దైవ చింతనలో లభిస్తుందని, ఆలయాలలో పూజలు మరియు ధ్యానం చేయడం వలన మనిషికి మనోఉల్లాసం కలిగి రెట్టింపైన శక్తితో జీవన ప్రమాణం సాగుతుందని వారు తెలిపారు.
అలాగే రాజస్థాన్ రాష్ట్ర మర్వాడి సమాజం వారి పాత్ర రాష్ట్ర ఆర్థికాభిృద్ధిలో ప్రశంసా నీయమని మరియు వారు చేసి సమాజ సేవా కార్యక్రమాలు ఆదర్శవంతమైనవని ఎమ్మేల్యే కొనియాడారు..

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బొబ్బా రంగా రావు, మాజీ ZPVC బొంగునూరి ప్రభాకర్ రెడ్డి, నిజాంపేట మాజీ సర్పంచి కోలన్ శ్రీనివాస్ రెడ్డి, తెరాస పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు సోమేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, రుద్ర అశోక్, పుప్పాల భాస్కర్, సీనియర్ నాయకులు అత్తిరి మారయ్య, వోరుగంటి కృష్ణ గౌడ్, సయ్యద్ రషీద్, వార్డు సభ్యుడు సిద్ధికి, మధు మోహన్, ఇమ్రాన్ బైగ్, రెహమాన్ మరియు మార్వాడీ సిర్వి సమాజం సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page