SAKSHITHA NEWS

Attracted by development and welfare, 200 people from BJP and Congress joined BRS

అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ నుండి 200 మంది బీఆర్ఎస్ లో చేరిక…

కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని గాజులరామారం గ్రామంలో బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సమక్షంలో సీనియర్ నాయకులు

మహ్మద్ మక్సుద్ అలీ, గోపాల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, బిజెపి నుండి (పెరుమండ్ల పరివార్) సభ్యులు సుమారు 200 మంది పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు.

బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో.. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశనంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి పార్టీలో చేరిన కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

రాబోయే రోజుల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరెన్నో కార్యక్రమాలతో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ సోమేశ్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు

పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, పాక్స్ డైరెక్టర్ శ్రీనివాస్ యాదవ్, నాయకులు నవాబ్, అబిద్, మసూద్, ఇబ్రహీం, చందు ముదిరాజ్, సత్యనారాయణ, మల్లేష్, హమీద్ మరియు పార్టీలో చేరిన వారు పోచయ్య, జగన్, శ్రీశైలం, విజయ్, జ్ఞానేశ్వర్, కిరణ్, మహిళా నాయకురాలు, యువకులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS