ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి కి ముస్లింల పక్షాన విజ్ఞప్తి

Spread the love

హుజురాబాద్ డివిజన్ మస్జీద్ అండ్ ఈద్గా ఖబరస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ మరియు జమ్మికుంట ఖాదర్ హలీమా మజీద్ సెక్రటరీ మొహమ్మద్ సర్వర్ పాషా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి కి ముస్లింల పక్షాన విజ్ఞప్తి చేశారు,,,,,


జమ్మికుంట పట్టణంలో ఆదివారం రోజు మసీద్ కమ్యూనిటీ హాల్లో జరిగిన ముస్లింల సమావేశానికి సభాధ్యక్షులుగా హుజురాబాద్ డివిజన్ మసీద్ అండ్ ఈద్గా ఖబర్స్తాన్ మేనేజ్మెంట్ కమిటీలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హుజురాబాద్ డివిజన్ మస్జిద్ అండ్ ఈద్గా కబ్రుస్తాన్ అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మరియు జమ్మికుంట ఖాదర్ హలీమా సెక్రటరీ సర్వర్ పాషా, ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మసీదులలో పనిచేస్తున్న ఇమామ్ మో జాన్ లకు సంబంధించిన 7000 అప్లికేషన్లు పెండింగ్లో ఉండగా దానిని ఈనెల 7వ తారీకు రోజున జీవో ఎంఎస్ 42 ద్వారా 7000 మందికి ఇమా మ మో జాన్ లకు మంజూరు చేస్తూ జీవో జారీ చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్ హుజురాబాద్ ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి లకు హుజూరాబాద్ డివిజన్ మస్జీద్గా అండ్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు అసోసియేషన్ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తో పాటు జమ్మికుంటలో ఖాదర్ హలీమా మజీద్ సెక్రెటరీ మహమ్మద్ సర్వర్ పాషా, మహమ్మద్ సర్దార్ మహమ్మద్ ఫెర్రోస్ మహమ్మద్ అప్రోచ్ మహమ్మద్ నసీర్ మహమ్మద్ అస్లాం అబ్దుల్ మాజీద్ మొహమ్మద్ జాకీర్ పతితరులు వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ హుజరాబాద్ పట్టణంలో ఉన్న ముస్లింల షాదీ ఖానా కొరకు రెండు కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేసి వెంటనే పనులను చేపట్టాలని అలాగే జమ్మికుంట పట్టణంలో ఉన్న షాదీఖానా కొరకు ఒక కోటి రూపాయలు వెంటనే మంజూరు చేయాలని హుజురాబాద్ జమ్మికుంట పట్టణాలలో ముస్లింల ఖబరస్థాన్ కొరకు ఒక్కొక్క ఎకరం 20 గుంటల చొప్పున స్థలాలను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసిన కానీ ఇప్పటివరకు కూడా ముస్లింలకు కబ్రిస్తాన్ స్థలాలను అప్పగించలేదు కావున వెంటనే ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఆ స్థలాలను మస్జిద్ అండ్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్కు అప్పగించాలని అలాగే ముస్లింలకు ఒకరికి లక్ష రూపాయలు ఇస్తానన్న దానికి ప్రతి ఒక్క ముస్లింకు ముస్లిం బందు పథకం ద్వారా ప్రతి ఒక్కరికి రాష్ట్రమంతటా ముస్లిం సోదరులకు అందించాలని అలాగే హుజురాబాద్ పట్టణంలో జమాత్ వారికి ఐదు గుంటల భూమి కేటాయిస్తామని అప్పటి ఆర్డిఓ కరీంనగర్ జిల్లా కలెక్టర్కు ప్రపోసర్స్ పంపించినారు కానీ అది ఇప్పటివరకు మంజూరు కాలేదు కావున వెంటనే మంజూరు చేసి ఐదు గుంటల స్థలం పట్టా సర్టిఫికెట్ అప్పగించాలని l మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు ఈ పనులన్నీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఈ పనులన్నీ చేసి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బి వినోద్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విప్ పాడి కౌశిక్ రెడ్డి లకు వారు విజ్ఞప్తి చేశారు.

Related Posts

You cannot copy content of this page