ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య మొదటి విడత ప్రచారం

Spread the love

ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య మొదటి విడత ప్రచారంలో
బొమ్మలరామారం మండల ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య పేరును అధిష్టానం ప్రకటించిన వెంటనే ప్రచారంలో ఐలయ్య దూకుడు పెంచారు బొమ్మలరామారం మండలంలో విస్తృత ప్రచారం నిర్వహించారు ప్రచార కార్యక్రమంలో భాగంగా మొదటిరోజు బొమ్మలరామారం మండల కేంద్రంలోని గట్టు మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారానికి శ్రీకారం చుట్టారు

అనంతరం పెద్ద పర్వతాపురం,మునిరాబాద్,ప్యారారం సోమాజిపల్లి సోలిపేట బోయిన్ పల్లి వాలు తండా సీత తండా లక్క తండా గోవిందు తండాలో విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఐలయ్య ఏ గ్రామానికి వెళ్లిన ఏ తండాకు వెళ్లిన ఐలయ్య ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు పెద్ద పర్వతపురం జరిగిన సభలో ఐలయ్య మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు అన్ని రకాలుగా నష్టపోయారని రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తా అని అప్పుల తెలంగాణ గా మార్చి తన కుటుంబాన్ని మాత్రం బంగారు కుటుంబం గా మార్చుకున్న ఘనత కేసిఆర్ కే దక్కిందన్నారు ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను గడప గడపకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త భుజాన వేసుకోవాలని ఆయన కోరారు

ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు మండల కేంద్రంలోని నేతాజీ యువజన సంఘానికి చెందిన నలభై మంది యువకులు ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సింగిర్తి మల్లేశం మహిళా అధ్యక్షురాలు సునీత రవీందర్ నాయక్ తో పాటు సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు గ్రామ శాఖ అధ్యక్షులు నియోజకవర్గ మండల స్థాయి యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Whatsapp Image 2023 10 16 At 6.11.20 Pm
Print Friendly, PDF & Email

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page