భారత్ జోడో యాత్రలో రాహుల్ వెంట నడిచిన సినీనటి స్వరభాస్కర్

Spread the love


Actress Swarabhaskar who accompanied Rahul in Bharat Jodo Yatra

భారత్ జోడో యాత్రలో రాహుల్ వెంట నడిచిన సినీనటి స్వరభాస్కర్

ఉజ్జయిని: భారత్ జోడో యాత్రలో బాలీవుడ్ ప్రముఖ నటి స్వరభాస్కర్ పాల్గొన్నారు.మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వెంట సినీనటి స్వరభాస్కర్ భారత్ జోడో యాత్రలో నడిచారు.

రాహుల్ గాంధీతో స్వరభాస్కర్ మాట్లాడుతూ నడిచారు.ఈ జోడో యాత్ర 150 రోజుల్లో 12 రాష్ట్రాల్లో 3,570 కిలోమీటర్లు నడిచేలా ప్రణాళిక రూపొందించారు.


భారతదేశాన్ని ఏకం చేయాలనే లక్ష్యంతో సాగుతున్న ఈ యాత్ర 83వ రోజు గురువారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మీదుగా సాగుతోంది.గత వారం తన సోదరి,పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా,ఆమె భర్త రాబర్ట్ వాద్రాతో కలిసి రాహుల్ నడిచారు.


సెప్టెంబరు 7వతేదీన ప్రారంభమైన ఈ పాదయాత్ర ఇప్పటివరకు 7 రాష్ట్రాల్లోని 36 జిల్లాల మీదుగా సాగింది.మరో 1209 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది.

Related Posts

You cannot copy content of this page