అడ్డగుట్టలో పద్మారావు గౌడ్ కు ఘన స్వాగతం

Spread the love

అడ్డగుట్ట రూపాన్ని మార్చిన ఘనత తమదే నని, పేద ప్రజల జీవితాల్లో వెలుగులను నింపేందుకు నిరంతరం తపిస్తూ శ్రమిస్తున్నామని డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తీగుల్ల పద్మారావు గౌడ్ అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ తో కలిసి అడ్డగుట్ట డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో రెండో రోజు విస్తృతంగా పర్యటించారు. ఇంటికీ తిరుగుతూ ఓటర్లను కలుసుకొని తమకు మద్దతు తెలపాలని అభ్యర్ధించారు. రియో పాయింట్, బుద్ధా నగర్, లోహియా నగర్, బోయ బస్తీ, మొండి బండ్ నగర్, మరాఠా బస్తీ, తుకారం గేటు తదితర ప్రాంతాల్లో పద్మారావు గౌడ్ ఎన్నికల ప్రచారం సాగింది.

ఈ సందర్భంగా స్థానికుల నుంచి పద్మారావు గౌడ్ కు మంచి స్పందన లభించింది. అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మితో పాటు డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి , కార్పొరేటర్, రాసురి సునీత, బీఆర్ ఎస్ యువ నేతలు కిషోర్ కుమార్, కిరణ్ కుమార్ గౌడ్, రామేశ్వర్ గౌడ్, త్రినేత్ర గౌడ్, అడ్డగుట్ట డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ అడ్డగుట్ట లో మౌళిక సదుపాయాలను కల్పించిన ఘనత తమదే అని అన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో నిలిచేలా తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. తాము హ్యాట్రిక్ సాధించడంతో పాటు సీఎం కెసిఆర్ హ్యాట్రిక్ ఖాయమని అన్నారు. కారు గుర్తుకే ఓటు వేయాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Whatsapp Image 2023 11 03 At 4.54.41 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page