కాలనీ వాసులతో కలిసి పాదయాత్ర

Spread the love

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్ మరియు నందమూరి నగర్ కాలనీ లో గల పలు సమస్యలు మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై జలమండలి అధికారులు మరియు కాలనీ వాసులతో కలిసి పాదయాత్ర చేసిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, కాలనీ వారి విజ్ఞప్తి మేరకు హైదర్ నగర్ మరియు నందమూరి నగర్ లో జలమండలి మేనేజర్ మరియు కాలనీ వారి తో కలిసి మంచి నీరు పైప్ లైన్ ఒక లైను మరియు స్వెరేజ్ లైన్ లు మూడు చోట్ల పని ఉన్నదని గుర్తించి, తక్షణమే పనులు మొదలుపెట్టాలని చెప్పడం జరిగింది, అలానే హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దడానికి నా వంతు శాయ శక్తుల కృషి చేస్తానని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ ప్రశాంతి, ఖదీర్, అష్రఫ్, యాసిన్, నక్క శ్రీనివాస్, సత్తార్, పప్పు, యూసుఫ్, హబీబ్, జాకీర్, యూసుఫ్, ఇమ్రాన్, ఇఫ్తేకర్, షకీర్, బిజాన్బీ, జ్యోతి, జుబెద, హైమద్ ఉన్నిశ్శ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page