సాక్షిత ; దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పలు సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ఆర్ధిక ఇబ్బందుల నుండి గట్టెక్కిచ్చిన గొప్ప నాయకుడు, ఆర్ధిక సంస్కరణల జాతిపిత మాజీ ప్రధానమంత్రి PV. నరసింహారావు అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాజీ ప్రధానమంత్రి PV 102 వ జయంతి సందర్భంగా PV మార్గ్ లో గల PV ఘాట్ లో మంత్రి తలసాని నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి PV నరసింహ రావు అని పేర్కొన్నారు. బహుబాషా కోవిదుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు గా పేరుగాంచారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోని తెలంగాణ ప్రభుత్వం PV సేవలను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ తగినరీతిలో గౌరవిస్తుందని చెప్పారు. PV శతజయంతిని ఎంతో ఘనంగా నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా నెక్లెస్ రోడ్డుకు PV మార్గ్ గా నామకరణం చేయడమే కాకుండా భారీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తినట్లు వివరించారు. ప్రపంచ దేశాలలో భారతదేశ ఖ్యాతిని చాటిచెప్పిన PV నరసింహారావు కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి తలసాని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో MLC, PV కుమార్తె సురభి వాణిదేవి, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ, RDO వసంత తదితరులు ఉన్నారు.
Home
Telangana
ఆర్ధిక సంస్కరణల జాతిపిత మాజీ ప్రధానమంత్రి PV. నరసింహారావు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు
Related Posts
Spread the love హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ,షరతులతో కూడిన అనుమతినివ్వగా..…
Spread the love వేడుకలకు హాజరైన టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఖమ్మం…
Spread the love మల్కాజ్గిరి లో జిహెచ్ఎంసి అధికారుల అలసత్వం ప్రజల పాలిట శాపం గా మారుతుంది… ఎన్నో సంవత్సరాలు గడుస్తున్న.. ప్రతి సంవత్సరం ప్రమాదాల బారిన పడి ప్రజలు ఇబ్బంది పడుతున్న… డ్రైనేజీ సిస్టం పొంగిపొర్లుతూ.. ఎన్నో కాలనీలకు ముంపు…
Spread the love నేను ఎలాంటి రేవ్ పార్టీలకు వెళ్లలేదు: హీరో శ్రీకాంత్ తాను బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నాననే ప్రచారం అవాస్తమని హీరో శ్రీకాంత్ పేర్కొన్నారు. తాను ఎలాంటి పార్టీలకు వెళ్లలేదని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నానని తెలిపారు.…
Spread the love జగిత్యాల డి.ఎస్.పి రఘు చందర్ ప్రెస్ మీట్… అర్ధరాత్రి అందాద 11.30 గంటలకు గోపులాపూర్ గ్రామానికి చెందిన బుర్ర నవీన్ మరియు జగిత్యాలకు చెందిన అతని స్నేహితులు జికూరి పవన్, మొగిలిపాల రాజేందర్, బొమ్మల వెంకటేష్, నాచుపల్లి…
Spread the love అలంకరణలకు ప్రత్యేకంగా నిలిచిన మల్కాజ్గిరి లోని ఆనంద్ బాగ్ లో గల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ వార్షిక చందనోత్సవం వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు… ఈ సందర్భంగా ఆలయ…
Spread the love రైతు వద్ద లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసిబికి చిక్కిన తహసీల్దార్ మాధవి. కమలాపూర్ తహసిల్దార్ ఆఫీస్ లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు కాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడించనున్న ఏసీబీ అధికారులు పూర్తి వివరాలు తెలియాల్సి…
Spread the love బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న బాలుడుఆపన్న హస్తం కోసం తల్లిదండ్రుల వినతి.. ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత రెక్కాడితే గాని డొక్కాని పేద కుటుంబం. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. పొద్దస్తమానం కూలి పనులు చేస్తే గాని…
Spread the love జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల …… ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ఈనెల 27న జరగనున్న వరంగల్ – ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికలలో భాగంగా ఎన్నికల సిబ్బందికి…
Spread the love కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలి – ఆదనవు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్. లత.…. సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: జిల్లాలో ఇంటర్మీడియెట్ సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్. లత సూచించారు. సోమవారం కలెక్టరేట్…