ఎన్ఎస్‌యూఐ నాయకులు గొల్ల జాన్ ఆధ్వర్యంలో 17వ సంవత్సరం రాజీవ్ గాంధీ మెమోరియల్ స్పోర్ట్స్‌ మీట్

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ హెచ్ఎంటీ గ్రౌండ్‌లో ఎన్ఎస్‌యూఐ నాయకులు గొల్ల జాన్ ఆధ్వర్యంలో 17వ సంవత్సరం రాజీవ్ గాంధీ మెమోరియల్ స్పోర్ట్స్‌ మీట్ ప్రారంభంలో భగంగా టాస్ వేసి కబడ్డీ మ్యాచ్‌ మరియు బ్యాటింగ్ చేసి క్రికెట్ మ్యాచ్ను ప్రారంభించిన మాజీ ఎంపీపీ, టీపీసీసీ ప్రతినిధి కొలన్ హన్మంత్ రెడ్డి .

తాను మాట్లాడుతూ ఆటలు ఆడేందుకు యువత ఆసక్తి చూపాలని పిలుపునిచ్చారు. అయితే.. క్రీడల్లో గెలుపు ఓటములు సహజం అని.. ఓటమి పాలైన వారు తిరిగి గెలుపు కోసం ప్రయత్నించాలని సూచించారు. క్రీడల్లో తమ ప్రతిభను చాటిన వారికి ఉన్నత అవకాశాలు ఉంటాయన్నారు హన్మంత్ రెడ్డి. క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మనోధైర్యంతో పాటు జీవితంలో క్రమశిక్షణ అలవాటు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యువజన నాయకులు, పార్టీ శ్రేణులు, స్థానికులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page