SAKSHITHA NEWS


1025 male candidates appeared on thirteenth day

పదమూడవ రోజు హజరైన 1025 మంది పురుష అభ్యర్థులు…

తుది పరిక్షలకు అర్హత సాధించిన 527 మంది అభ్యర్థులు..

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో స్ట్ఫైండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్స్, కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా బుధవారం జరిగిన దేహదారుఢ్య పరీక్షలకు 1025 మంది హజరైయ్యారని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. ఇందులో 527 మంది అభ్యర్థులు తుది పరిక్షలకు అర్హత సాధించారని తెలిపారు.

మొత్తం 1211 మంది అభ్యర్థులు హజరు కావాల్సివుండగా 1025 మంది హజరై ఈవెంట్లలో పాల్గొన్నారని తెలిపారు. అనారోగ్య సమస్యలతో దేహధారుడ్య పరీక్షలలో పాల్గునే పరిస్థితులు లేవని అభ్యర్థులు చేసుకుంటున్న దరఖాస్తులను డాక్టర్ జితేందర్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం పరిశీలించి సమస్య తీవ్రతను బట్టి ఎన్ని రోజులు విశ్రాంతి అవసరమనే విషయాన్ని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు నివేదిస్తారని తెలిపారు.


SAKSHITHA NEWS