పూలే ఆశయ సాధనకై ప్రతి సోమవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తామన్న – జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ

Spread the love

స్త్రీ అభ్యున్నత వాది జ్యోతి రావ్ పూలే కు ఘన నివాళులు అర్పించిన…

  • జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరిత తిరుపతయ్య..
  • మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్….

గద్వాల పట్టణంలోని క్రిష్ణవేణి చౌక్ వద్ద గల జ్యోతి రావ్ పూలే విగ్రహాన్నికి అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పూలే చిత్రపటాన్నికి జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత తిరుపతయ్య మరియు మున్సిపల్ చైర్మన్ బి.ఎస్‌.కేశవ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు…

అనంతరం వారు మాట్లాడుతూ సత్యశోధక సమాజ స్థాపకుడు బలహీన వర్గాల ఆశజ్యోతి గులాబ్ గిరి రచయిత, స్త్రీ అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు సంఘ సంస్కర్త శ్రీ జ్యోతిరావ్ పూలే జయంతి సందర్భంగా నివాళులు జరుపు కావడమే కాకుండా బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి పూలే అడుగుజాడల్లో నడచి సేవ చేసే అవకాశం కలగపించిన ఆయన జ్ఞాపకార్థంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ అందుబాటులో ఉంటూ ప్రతి సోమవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు జయంతి వేడుకలో ప్రజలకు సందేశం ఇచ్చారు…. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరపున వారధిగా నిలిచి,ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికై ప్రజ దర్బార్ ఏర్పాటు చేసినట్లు సరితమ్మ సూచించారు….

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పి చైర్మన్ బండారి భాస్కర్, బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, మధుసూదన్ బాబు,అమరావాయి కృష్ణారెడ్డి,గట్టు కృష్ణమూర్తి,పట్టణ అధ్యక్షుడు ఇసాక్, డిటిడిసి నర్సింహులు, లత్తిపురం వెంకట్రామిరెడ్డి,ఎల్లప్ప, పులిపాటి వెంకటేష్,నరహరి గౌడ్, పూడూర్‌ కృష్ణ,నాగేంద్ర యాదవ్, కొటేష్,నాగరాజు,శ్రీమన్నారాయణ,బొట్టు సుధాకర్,తుమ్మల నర్సింహులు,మాల మహానాడు శ్రీను,భాస్కర్ యాదవ్,నాగ శంకర్, తుమ్మల నర్సింహులు,జమ్మిచేడు సురేష్,యూసుఫ్,అడ్వకేట్ షాఫీవుల్లా,ఇక్బాల్, ఖలీమ్,TNR జగదీష్, కరాటే సత్యం,గువ్వల గోపాల్, కొత్త గణేష్,కుంటలు రవి, వెంకటస్వామి ఆచారి,కిషోర్, మోహన్ యాదవ్, జమ్మిచేడు రాము,రవి,తదితరులు ఉన్నారు…

Related Posts

You cannot copy content of this page