విగ్రహాల తొలగింపు ముసుగులో కుల,మతాలకు చిచ్చు పెడుతున్న వైసీపీ:-నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ

Spread the love

YCP is inciting caste and religion in the guise of removing idols:- Narasa Raopet Constituency TDP in-charge Docchadalavada

విగ్రహాల తొలగింపు ముసుగులో కుల,మతాలకు చిచ్చు పెడుతున్న వైసీపీ:-నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ

నరసరావుపేట పట్టణంలోని పల్నాడు రోడ్డులో వైఎస్సార్ విగ్రహాన్ని మాత్రమే తొలగించాలని గౌరవ హై కోర్ట్ వారు ఆదేశాలు జారీ చేసారని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు తెలిపారు.స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డా౹౹చదలవాడ మాట్లాడుతూ పల్నాడు రోడ్డులో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని మాత్రమే తొలగించి తిరిగి ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు.

తమ పార్టీకి చెందిన వారు హైకోర్టులో వైస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పై రిట్ పిటీషన్ వేయడం జరిగిందన్నారు.తెలుగుదేశం పార్టీ మాత్రం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని మాత్రమే తొలగించాలని,అక్కడ ఆవిష్కరించేందుకు వీల్లేదని ఆయన వెల్లడించారు.వై.ఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని అడ్డుపెట్టుకుని పల్నాడు రోడ్ లో ఉన్న మిగతా విగ్రహాలు అన్నిటినీ తొలిగించాలి అని వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుట్ర పన్నుతున్నారనిన్నారు.

దీనికి ప్రభుత్వ అధికారులు పావులు కుదుపుతున్నారన్నారు.వైసీపీ ప్రజాప్రతినిధులు అతి తెలివి ప్రదర్శిస్తూ గతంలో ఏర్పాటు చేసిన సామాజిక వర్గాల నేతల విగ్రహాలు, స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు,ఎన్టీఆర్ విగ్రహాలు కూడా తొలగించాలని వ్యూహరచన చేసి అధికారులను పావులుగా ముందు పెట్టి చేస్తున్న చర్యలు నీతిమాలిన చర్యలుగా భావిస్తున్నట్లు డా౹౹చదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు.మిగతా విగ్రహాలు కదిలిస్తే అధికారులు బాధ్యత వహించాలని హెచ్చరించారు.

Related Posts

You cannot copy content of this page