We will stand by the activists and support them: Padmarao Goud
కార్యకర్తలకు అండగా ఉంటాం, వారిని ఆదుకుంటాం : పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ : అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన బీ.ఆర్.ఎస్. పార్టీ సీనియర్ నేత, మాజీ వార్డు మెంబర్ అంజయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో అకాల మృత్యువాత పడ్డారు. వారి కుటుంబాన్ని ఆదుకోవడంలో తన వంతు ప్రయత్నంగా సాక్షిత సికింద్రాబాద్ ఎం.ఎల్.ఏ.తీగుల్ల పద్మారావు గౌడ్ బీ.ఆర్.ఎస్.కేంద్ర కార్యాలయాన్ని సంప్రదించి దివంగత అంజయ్య కుటుంబ సభ్యుల పేరిట భీమా డబ్బులు లభించేలా ఏర్పాట్లు జరిపారు. అంజయ్య సతీమణి సుజాత, కుటుంబ సభ్యులకు సితాఫలమండీ లోని తన కార్యాలయంలో రూ.రెండు లక్షల భీమా చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, నేతలు లింగాని శ్రీనివాస్, నక్క మధు, మల్లేష్, రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ బీ.ఆర్.ఎస్. పార్టీ కార్యకర్తలకు తాము అండగా నిలుస్తామని, అన్ని వేళల్లో వారికి వెనుదన్నుగా నిలిచి ఆదుకుంటామని పేర్కొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో తమకు కార్యకర్తల నుంచి నిత్యం ఆదరణ లభిస్తోందని, వారికి ఎన్నటికీ రుణపడి ఉంటామని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
![కార్యకర్తలకు అండగా ఉంటాం, వారిని ఆదుకుంటాం : పద్మారావు గౌడ్ 2 WhatsApp Image 2024 06 22 at 14.44.29](https://sakshithanews.com/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-22-at-14.44.29-1024x683.jpeg)