భద్రాచలం నియోజకవర్గంలో పొంగులేటి పర్యటన

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి భద్రాచలం నియోజకవర్గంలో ఆదివారం పర్యటించనున్నారు. పర్యటనలో భాగంలో వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాల్లోని పలు గ్రామాలను సందర్శిస్తారు. ఈ మేరకు పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంచార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా ఆయా గ్రామాల్లోని పలు బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదారుస్తారన్నారు. పలు శుభకార్యక్రమాలకు కూడా హాజరవుతారని తెలిపారు. కావున ఈ పర్యటనలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని పొంగులేటి పర్యటనను విజయవంతం చేయాలని దయాకర్ రెడ్డి కోరారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page