విశాఖ రాజధానికి అడ్డొస్తే రాజకీయంగా

Spread the love
విశాఖ రాజధానికి అడ్డొస్తే రాజకీయంగా చితక్కొట్టాలి:మంత్రి ధర్మాన

అరసవల్లి: విశాఖలో రాజధాని ఏర్పాటైతే మన భవిష్యత్‌ బాగుంటుందని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. దీనికోసం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదని..విశాఖ రాజధాని అని ఏక కంఠంతో మాట్లాడితే చాలన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో నిర్వహించిన 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రపై మంత్రి ఘాటుగా స్పందించారు. ''మా పీక కోసేందుకు అమరావతి నుంచి అరసవల్లికి వస్తారా? మా ప్రాంతాలు అభివృద్ధి చెందనక్కర్లేదా? విశాఖ రాజధానికి అడ్డొస్తే రాజకీయంగా చితక్కొట్టాలి'' అని ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు.

Related Posts

You cannot copy content of this page