ప్రభుత్వ ఆదేశానుసారం వసతి గృహాల నిర్వహణ ఉండాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

Spread the love

సాక్షిత : *వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే *డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ నియోజకవర్గ SC, ST, BC వసతి గృహాల సలహా సంఘం సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వం నిర్దేశించిన మెనూ తప్పనిసరిగా అమలు చేయాలని, జిల్లాస్థాయి మరియు డివిజన్ స్థాయి అధికారులు వసతిగృహాలను సక్రమంగా పర్యవేక్షణ చేయాలన్నారు.
వసతి గృహములలో మౌలిక వసతులు సక్రమంగా ఉండేటట్లు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
విద్యార్థులకు అందించే అన్ని రకముల సదుపాయాలలో వసతులు సకాలంలో అందేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు.
వసతి గృహలలోని విద్యార్థులు అందరికీ చదువు విషయంలో కూడా హాస్టల్ వార్డెన్లు వ్యక్తిగత శ్రద్ధ వహించి వారి ఆరోగ్యము మానసిక వికాసము అభివృద్ధి గురించి అవగాహన కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో DSCDO N. మల్లేశం, ASWO ఉమాపతి, ABCWO N.భీమ్ రాజ్ మరియు వసతి గృహముల వార్డెన్లు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page