తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్

Spread the love

జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి, జూన్ 21: తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ సార్ అని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. నీళ్లు నిధులు నియామకాలు సార్ కల అని, సీఎం కేసీఆర్ ఆ కలను నిజం చేసి చూపించారని ప్రశంసించారు.

భూపాలపల్లి ప‌ట్ట‌ణంలో ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గల జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ… జయశంకర్ సార్ తెలంగాణే ఊపిరిగా శ్వాస ఉన్నంత వరకు తెలంగాణ కోసం ఉద్యమించారని ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. . తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో కేసీఆర్‌కు వెన్నంటి ఉండి రాష్ట్ర సాధనలో భాగస్వాములయ్యారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page