కల్వకుర్తిలో విజయవంతంగా 500 మంది యువతతో నిరుద్యోగ వాణి-ఐక్యత భరోసా కార్యక్రమం

Spread the love

Unemployment Voice-Unity Assurance Program with 500 Youth Successfully in Kalvakurti

కల్వకుర్తిలో విజయవంతంగా 500 మంది యువతతో నిరుద్యోగ వాణి-ఐక్యత భరోసా కార్యక్రమం

సాక్షిత ప్రతినిధి ముఖ్య అతిథులుగా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో నిరుద్యోగ వాణి ఐక్యత భరోసా కార్యక్రమంలో ఐక్యత ఫౌండేషన్ అంటేనే నమ్మకం అనే విధంగా నలుమూలల నుంచి అత్యధికంగా యువత పాల్గొనడం జరిగింది.

కల్వకుర్తి పట్టణంలో పద్మశాలి భవన్ లో ‘నిరుద్యోగ వాణి- ఐక్యత భరోసా’అనే నినాదంతో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి నిరుద్యోగ యువతకు భరోసా కల్పించడంలో ఐక్యత ఫౌండేషన్ అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి ఆలోచన పాటు ఉపాధి కల్పనకై కృషి చేస్తానని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అన్నారు,

ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మండలానికి అత్యధిక సంఖ్యలో యువతీయువకులుపాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఐక్యత ఫౌండేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు

ఈకార్యక్రమంలో ఐక్యత ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుంకిరెడ్డి వరప్రసాద్ రెడ్డి, తర్నికల్ మాజీ సర్పంచ్ పవన్ కుమార్ రెడ్డి, సదానంద గౌడ్, మాజీమార్కెట్ డైరెక్టర్ నిజాముద్దీన్,బాల్ రెడ్డి, ఐక్యత ఫౌండేషన్ మండల వాలంటీర్స్ సభ్యులు శ్రీపతి రాజు,ఆవ గణేష్, దారెడ్డి అభినవ్, చద్రశేఖర్ రమేష్ నాయక్,హసన్,కేశమల్ల శేఖర్, శ్రీనునాయక్,శివకృష్ణ,షఫీ, ఉస్మాన్,జూలూరిబాలకృష్ణ, రాహుల్ నాయక్,మహేష్ సందీప్,తదితరులుపాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page