షాబాద్ మండల కేంద్రంలో హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్ ఆధ్వర్యం

Spread the love

సాక్షిత : షాబాద్ మండల కేంద్రంలో హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మ బస్వేశ్వర విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్ , ఎమ్మెల్సీ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి , ఎమ్మెల్యేలు కాలే యాదయ్య , అంజయ్య యాదవ్ , బీసీ కమిషన్ మెంబర్ శుభప్రద్ పాటిల్, జడ్పీటీసీ అవినాష్ రెడ్డి , రాష్ట్ర హాకీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి తో కలిసి పాల్గొని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మహాత్మ బస్వేశ్వర విగ్రహం ఏర్పాటుకు కృషి చేసిన కొండా విజయ్ ని ప్రత్యేకంగా అభినదిస్తున్నాను అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. బసవేశ్వరుడు సంఘ సంస్కర్త.12వ శతాబ్దంలో నే ఆయన అనుభవ మంటపం ను స్థాపించి, కులమతాలకు అతీతంగా అందరికి సమాన హక్కులు కల్పించారు. ఆయన ఆకాలంలోనే హరిజనులకు ఆలయ ప్రవేశం కల్పించి, సహ పంక్తి భోజనాలు నిర్వహించారు. స్త్రీలకు సమాన హక్కులు కల్పించారు అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు. 2016 సంవత్సరం లో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ బసవేశ్వరుడి విగ్రహం ఏర్పాటు చేయడం తో పాటు, అధికారికంగా బసవేశ్వరుని జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.


విద్య, సమాజం, సమానత్వం గురించి పోరాటం చేసిన మహనీయుడు, సామాజిక ఆధ్యాత్మిక విప్లవకారుడు బసవేశ్వరుని జయంతి సందర్భంగా వారికివే మా నివాళులు.ఇచ్చిన మాట ప్రకారం, సీఎం కేసీఆర్ హైదరాబాద్‌ నడిబొడ్డున ట్యాంక్‌బండ్‌పై బసవేశ్వరుడి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేసి, ఏటా ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారు.లింగాయత్‌ జాతి గౌరవాన్ని మరింత పెంచేలా..లింగాయత్‌ల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు, కోకాపేటలో బసవ భవన్‌ ఏర్పాటు కోసం విలువైన స్థలం కేటాయించి రూ.10 కోట్ల నిధులను సమకూర్చడం జరిగింది.అదేవిధంగా అపూర్వ ప్రజాస్వామ్య వాది బస వేశ్వరుడు. పాల్కురి సోమనాథుడు తన ఆరాధ్య దైవమైన బస్వేశరుని పై బసవ పురాణం రాశాడు అని, ఆయన గొప్పతనాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం పార్లమెంట్ ప్రాంగణంలో బస వేశ్వరుని విగ్రహన్ని ఏర్పాటు చేసింది అని అదేవిధంగా లింగాయత ధర్మకర్త సృష్టి కర్త మహాత్మ బస్వేశ్వరుడు విశ్వ గురువు. మహా మానవతా వాది ,సంఘ సంస్కర్త, కుల, మత, వర్గ, వర్ణ వ్యవస్థను రూపుమాపడనికి క్రీ.శే. 12 వ శతాబ్దంలో నే పునుకున్న మొదటి సాంఘిక విప్లవకారుడు అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. అదేవిధంగా స్త్రీ ,పురుష అసమానతలు తొలగించడానికి కృషి చేసిన అభ్యుదయవాది అని, దళితులకు ఆలయ ప్రవేశం కలిపించిన ప్రగతి శీలి అని, మొట్టమొదట కులాంతర వివాహం చేసిన గొప్ప సంఘసంస్కర్త అని, తన కాలపు సమాజ జీవితంలో వెలుగులు నింపిన మహనీయుడు బసవన్న అని, ముక్త సమాజ వైతాళికుడు, జగమెరిగిన శ్రేష్ఠ దార్శనికుడు, సామాజిక వ్యవస్థలో సమానత్వం ఉండలని ఆకాంక్షించారు. మనుషులు అంత శాంతి సామరస్యలతో సహజీవనం జరుపాలని బోధించారు.సుఖ సంతోషాలకు కష్టపడి పనిచేయాలని, నిరాడంబరంగా జీవించాలని ,అనాదిగా వస్తున్న మూఢ నమ్మకాలను, ఆచారాలను బసవన్న తీవ్రంగా ఖండించారు అని, ప్రభుత్వ విప్ గాంధీ ఆయన సేవలను కొనియాడారు. సమసమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరు బసవన్న జీవితం ను ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన చూపిన బాటలో నడవాలని, యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం ఆయన జీవితం అని, బసవన్న ఆశయల సాధనకు ప్రతి ఒక్కరు కృష్జి చేయాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సంఘము సభ్యులు లింగప్ప, శ్రీకరప్ప, మల్లికార్జున్, ప్రదీప్, నవీన్ , బస్వరాజ్, పర్శవేది, ప్రవీణ్, శేఖర్, సంతోష్, సందీప్, రవి, విశ్వనాథ్, రమేష్,దీపక్,సర్వేష్,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page