గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్

Spread the love

గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
మహబూబాబాద్ జిల్లాలో గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరిపెడ పట్టణ కేంద్రంలోని కాకతీయ కళాతోరణం వద్ద మరిపెడ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు 10.5 కేజీల గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ 2,50,000గా ఉన్నట్లు తొర్రూరు డీఎస్పీ సురేష్ తెలిపారు. నిందితులైన బానోత్ బాబు సింగ్, బత్తుల వెంకటేష్ ను కోర్టులో హాజరు పరిచినట్టు వెల్లడించారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page