ఇందిరా గాంధీ విగ్రహం ఉన్న స్థలాన్ని పరిశీలించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,126 డివిజన్(జగథ్గిరిగుట్ట) లాస్ట్ బస్ స్టాప్ వద్ద 1989లో మాజీ సిఎల్పీ నాయకులు పి.జనార్ధన్ రెడ్డి ఆవిష్కరించిన ఇందిరా గాంధీ విగ్రహం నిన్న లారీ ఢీకొని ధ్వంసం అయిన విషయాన్ని తెలుసుకుని ఇందిరా గాంధీ విగ్రహం ఉన్న స్థలాన్ని పరిశీలించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి


ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతి రెడ్డి మాట్లాడుతూ ఇందిరా గాంధీ విగ్రహ పునర్నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని స్థానిక నాయకులను కోరారు.అదే విధంగా స్థానిక సి.ఐ ని కలిసి ప్రమాదం పై దర్యాప్తు చేసి,చర్యలు తీసుకోవాలని కోరారు.


ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మండల మాజీ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి,దుండిగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మద్దికుంట నవీన్ రెడ్డి,బౌరంపేట్ మాజీ సర్పంచ్ మిద్దెల యాదిరెడ్డి,రాష్ట్ర ఓ‌బి‌సి సెల్ కొ-ఆర్డినేటర్ గడ్డమీది భరత్ గౌడ్,ఐ‌ఎన్‌టి‌యూ‌సి నాయకులు శ్రీనివాస్ చారి,రేవంత్ అన్న సేన అధ్యక్షులు గూడ ప్రవీణ్ గౌడ్, ఎన్‌ఎస్‌యూ‌ఐ నాయకులు బండి సాయి,యువజన కాంగ్రెస్ నాయకులు బత్తుల చిరంజీవి,మాదిరెడ్డి అరుణ్ రెడ్డి,రవి నాయక్,మిద్దెల సీతారాం రెడ్డి,రవి నాయక్ మరియు స్థానిక నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page