హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT శాతవాహన నగర్ లో నెలకొన్న పలు సమస్యలు

Spread the love

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT శాతవాహన నగర్ లో నెలకొన్న పలు సమస్యలు మరియు వాటి పరిష్కారానికై తీసుకోవాల్సిన చర్యలపై, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి ఇంజనీరింగ్, జలమండలి అధికారులతో మరియు కాలనీ వాసులతో కలిసి పాదయాత్ర నిర్వహించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ HMT శాతవాహన నగర్ కాలనీ వాసులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ,సమస్యలను పరిగణలోకి తీసుకోని, వారి విజ్ఞప్తి మేరకు కాలనీలలో పాదయాత్ర చేపట్టడం జరిగినది అని, ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, సంతులిత, సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. అదేవిధంగా కాలనీ వాసులు అందరూ కలిసి కాలనీ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని, కాలనీ వాసులందరి సమిష్టి కృషి తో ఆదర్శవంతమైన కాలనీ గా తీర్చిదిద్దుతామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అదేవిధంగా డివిజన్ లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా కృషి చేస్తామని ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అధికారులు మేనేజర్ ప్రశాంతి, ఏఈ రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్ కాలనీ వాసులు అందే నర్సింహ, రామ కోటేశ్వర రావు, యాది రెడ్డి, మదన్ మోహన్, సీత రాముడు, ఐవి శ్రీనివాస్, హనుమంత రాజు, కృష్ణ మూర్తి, కృష్ణ రావు, ప్రకాష్, శంకర్ రావు, రాం మోహన్, ఎస్ వి ఎస్ రాజు, నర్సింగ రావు, వెంకట్రామిరెడ్డి, బాబు రావు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page