ఆశీలుకు టెండర్ రద్దు చేయాలి,వేలం పాట మళ్లీ నిర్వహించాలి

Spread the love

ఆశీలుకు టెండర్ రద్దు చేయాలి,వేలం పాట మళ్లీ నిర్వహించాలి

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం

స్పందనలో కలెక్టర్ కు టీడీపీ కౌన్సిలర్ల ఫిర్యాదు

కొండపల్లి పురపాలికలో ఇటీవల నిర్వహించిన ఆశీలు టెండర్ ను రద్దు చేసి తిరిగి వేలం పాట నిర్వహించాలని టీడీపీ కౌన్సిలర్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు టీడీపీ కౌన్సిలర్ లు సోమవారం స్పందనలో ఫిర్యాదు చేశారు. కనీసం కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకుండా, నోటీసు బోర్డులో పెట్టకుండా ఏకపక్షంగా వేలం పాట నిర్వహించారన్నారు. మున్సిపాలిటీకి రూ.25 లక్షలకు పైగా ఆదాయం లభించే ఆశీలు టెండర్ ను రూ.10.25 లక్షలకు దక్కించుకున్నారంటే ఆదాయానికి గండి కొట్టినట్లేనన్నారు. దీనిని కలెక్టర్ రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page