రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం

Spread the love

సాక్షిత : *మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * కమీషనర్ రామకృష్ణ రావు 23వ డివిజన్ డివిజన్ ప్రగతి నగర్ సాయిలక్ష్మి లేఅవుట్ వద్ద ఏర్పాటు చేసిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ G. శ్రీనివాస్ యాదవ్ తో కలిసి కంటి వెలుగు కంటి పరీక్ష శిబిరాన్ని ప్రారంభించారు.


ఈ సందర్భంగా మేయర్ కంటి పరీక్ష శిబిరంలో ఏమైన సదుపాయాల లోపాలు ఉన్నాయా అని వైద్యులను అడిగి తెలుసుకొని, ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం మరియు అవసరమైన వారికి కళ్ళ అద్దాలను,మందులను అందజేయాలని తెలియజేశారు.మరియు అన్ని రకాల సౌకర్యాలను పెంచి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని NMC వైద్య సిబ్బందిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ కార్పొరేటర్ ఇంద్రజిత్ రెడ్డి,NMC బిఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ రాములు నాయక్,4వ డివిజన్ బిఆర్ఎస్ ప్రెసిడెంట్ మురళీధర్ యాదవ్,ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ సుకృత,డా.భవానీ ప్రసాద్,వైద్య బృందం,అధికారులు మరియు సిబ్బంది స్థానిక కాలనీ అసోసియేషన్ సభ్యులు,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page