అందరికీ నాణ్యమైన వైద్యం అందాలనేదే ముఖ్య ఉద్దేశం.

Spread the love

వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెం గ్రామం నందు
ఆరోగ్య శ్రీ కార్డు ల పంపిణీ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తనయుడు యువ నాయకులు బొల్లా గిరిబాబు .

ఈ సందర్భంగా వారు డాక్టర్ వైయస్సార్ ఆరోగ్య శ్రీ పథకం కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందేవిధంగా కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్య శ్రీ కార్డులను అర్హులైన వారికి పంపిణీ చేశారు.

అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన విద్య, వైద్య అందిచటమే ప్రధాన ఉద్దేశం గా పనిచేస్తున్న ప్రభుత్వం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆనాడు ఈ కార్యక్రమం కు శ్రీకారం చుట్టారని తెలిపారు. గతంలో ఈ పథకం పరిమితి 5 లక్షల వరకు ఉండేదని, ఇప్పుడు ఆ పరిమితిని 25 లక్షల కు పెంచుతూ మరికొన్ని వ్యాధులను ఈ పథకం లో కలుపుకొని ప్రజలకు నాణ్యమైన విద్యం అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం కు ప్రజలు అండగా ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బొల్లా గిరిబాబు తో పాటు నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు..

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page