ప్రజల దాహార్తిని తీర్చాలనే ఆలోచన గొప్పది….

Spread the love

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్….

27వ వార్డులో మంగ మధు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి మరియు చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే…

వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చాలనే ఆలోచన చాలా గొప్పది అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ అన్నారు పట్టణంలోని 27వ వార్డులో కాంగ్రెస్ యువనేత మంగ మధు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం కేంద్రం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో దాహార్తిని తీర్చేందుకు మంగ మధు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా నిత్యం ప్రజల్లో ఉండే సేవకులు భవిష్యత్తులో నాయకులు అవుతారని అన్నారు. నీటిని అవసరం మేరకే వినియోగించాలి అని భవిష్యత్ తరాలకు నేటి సంపదను సమృద్ధిగా అందాలంటే నేటి నుంచే నీటి వృధాను అడ్డుకోవాలని సూచించారు చేయి చేయి కలిపి నీటి వృధాను అరికట్టడంలో ముందుకు సాగుదాం అని ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాగతం కావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు.. బాల్రాజుగౌడ్,మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వం,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొంకల్ల చెన్నయ్య,బస్వం అప్ప,అంచరాములు,మురళీమోహన్ అప్పీ, మంగ అశోక్,శుక్లవర్ధన్ రెడ్డి,నలమోనిశ్రీధర్, బుడ్డ నరసింహ,మంకల శ్రీశైలం,నీరటి వాసు,బూర్గుల గంగాధర్, జగదీష్ రాజు తదితరులు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page