SAKSHITHA NEWS

The government is working for the welfare of all the people

అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి…

క్రిస్మస్ కానుకల పంపిణీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని వివేకానంద్ నగర్ కింగ్ డం ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ చర్చ్ వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగ సందర్భంగా అందిస్తున్న క్రిస్మస్ కానుకలను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలు కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అధికారికంగా పండుగలను నిర్వహిస్తుందని, అందుకే పేద కుటుంబాల్లో ఆనందం కోసం కానుకలు అందిస్తుందని అన్నారు.

గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ పథకాలను కేంద్రంతో పాటు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తంగ లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు మహ్మద్ మక్సూద్ అలీ, పాస్టర్ క్రీస్తురాజు, మహిళా అధ్యక్షురాలు స్వప్న, వర ప్రసాద్, అశోక్, వహీద్ ఖురేషి, శ్రీశైలం యాదవ్, షౌకత్ అలీ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS