కేసీఆర్, బీఆర్ఎస్ గురించి ప్రజలు ఆలోచించడం మానేశారని ముఖ్యమంత్రి

Spread the love

కేసీఆర్, బీఆర్ఎస్ గురించి ప్రజలు ఆలోచించడం మానేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగానికి రాలేదంటేనే కేసీఆర్ బాధ్యత అర్థం అవుతోందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కాలం చెల్లిన ఔషధమని పేర్కొన్నారు. చెప్పారు. కాళేశ్వరంపై విచారణకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు చెప్పిందన్న రేవంత్ రెడ్డి, విశ్రాంత జడ్జితో విచారణ జరిపించుకోవాలని చెప్పారని వెల్లడించారు.

హైకోర్టు చెప్పిన అంశంపై మంత్రివర్గంలో లేదా అసెంబ్లీలో చర్చిస్తామని వివరించారు. మరోవైపు బీఏసీ సమావేశానికి కేసీఆర్ స్థానంలో హరీశ్ రావు వెళ్లడంపై సీఎం రేవంత్ స్పందించారు. బీఏసీ సమావేశానికి అందులోని సభ్యులే రావాలని స్పష్టం చేశారు. రేపు హిమాన్షు (కేటీఆర్ తనయుడు) కూడా వస్తానంటే ఎలా అని ఎద్దేవా చేశారు. ఐదేళ్లపాటు శాసనసభ వ్యవహారాల మంత్రిగా చేసిన హరీశ్ రావుకు ఆ మాత్రం అవగాహన లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రతిపక్ష హోదా నేతకు గది కేటాయింపుపైనా రేవంత్ మాట్లాడారు. గది మార్పు స్పీకర్ నిర్ణయమని తెలిపారు. అసెంబ్లీలో కులగణన తీర్మానం ఉంటుందని, అంశాలు చర్చించాల్సిన అవసరం ఉందనుకుంటే సభాపతి సభ నిర్వహణ కాలం పొడిగించవచ్చని చెప్పారు. కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులను గత ప్రభుత్వం అప్పగించిందని ఆరోపించారు. సాగర్‌ను జగన్ పోలీసులతో ఆక్రమించినా కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు.

ఏపీ వాలాలు ప్రతి రోజు 12.5 టీఎంసీలను తీసుకెళ్తుంటే కేసీఆర్ అడ్డుకోలేదని ధ్వజమెత్తారు. బేసిన్‌లు లేవు భేషజాలు లేవని కేసీఆర్ అన్నారు. అక్కడే ఆయన కమిట్‌మెంట్ ఏంటో తెలిసిపోతోంది. కృష్ణా బేసిన్‌లో బీఆర్ఎస్‌ను ప్రజలు తిరస్కరించారు. మా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉంది. ఆరుగ్యారంటీలు తప్పకుండా అమలు చేస్తాం. త్వరలోనే మరో రెండు గ్యారంటీలు అమల్లోకి వస్తాయి. గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత కరెంట్, రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ గ్యారంటీల అమలుపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నాం. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. సీఎంగా నేను కేసీఆర్‌ను కూడా కలుస్తాను. విజయ్‌సాయి రెడ్డి నాన్ సీరియస్ పొలిటీషియన్. అలాంటి వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.” అని సీఎం రేవంత్ అన్నారు.

Related Posts

You cannot copy content of this page