ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే ప్రభుత్వ లక్ష్యం

Spread the love

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే ప్రభుత్వ లక్ష్యం…

రూ.53 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి సౌకర్యాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని వీనస్ రాక్ హైట్స్ కాలనీలో రూ.53 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి సౌకర్యాన్ని ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం 100కెవి ట్రాన్స్ఫార్మర్, కాలనీ ఎంట్రన్స్ గేట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అధినాయకత్వంలో.. గౌరవ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి సహకారంతో అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ప్రతి బస్తి, కాలనీలో ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. కొత్తగా ఏర్పాటైన కాలనీలలో సైతం సకల సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page