ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం…

Spread the love

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం…

గాజులరామారం డివిజన్ లో రెండు ఆర్టీసీ బస్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని చంద్రగిరి నగర్, శ్రీ రామ్ నగర్ బస్తీ వాసుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆర్టీసీ అధికారులతో మాట్లాడి రెండు బస్సులు ఏర్పాటు చేయించారు. ఈ మేరకు చంద్రగిరి నగర్, శ్రీ రామ్ నగర్ నుండి సీబీఎస్ వరకు కాలేజీ విద్యార్థులు, ప్రజల సౌకర్యార్థం రెండు ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రారంభించి, ప్రయాణించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం అన్నారు. విద్యార్థులు, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ విజయ్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ స్వాతి మరియు స్థానిక డివిజన్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page