రూ.3.30 కోట్లతో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు

Spread the love


Thanks to the MLA for completing all the development works with Rs.3.30 crores

రూ.3.30 కోట్లతో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన సంక్షేమ సంఘం సభ్యులు…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని న్యూ వివేకానంద్ నగర్ కు చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాలనీలో రూ.3.30 కోట్లతో సీసీ రోడ్లు, భూగర్భడ్రైనేజీ వంటి అభివృద్ధి పనులన్నీ పూర్తైన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే ని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దోనే రామమోహనరావు రావు, జెనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రావు, వైస్ ప్రెసిడెంట్ బీఎస్ నాయుడు, ముకేష్ గౌడ్, సెక్రటరీలు సురేష్, నీలం రెడ్డి, అచ్చుత రామయ్య, ప్రభాకర్, సత్య, ఏ.శ్రీనివాస్, నవీన్ రెడ్డి, భాను, చలపతి పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page