శాశ్వత గ్రంథాలయాల భవనాలు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసిన ప్రభుత్వానికీ ధన్యవాదాలు

Spread the love

ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ బత్తుల దేవానంద్,జిల్లా గ్రంధాలయ కార్యదర్శి కె ఝాన్సి లక్ష్మి,బాపట్ల గ్రంధాలయ గ్రేడ్ 1అధికారి ఏ శివాజీ గణేశన్,ఆఫీస్ సభార్డినేటర్ హర్శత్ కుమార్ లు బుధవారం మాజీ డిప్యూటీ స్పీకర్ కోనా రఘుపతి నీ మర్యాద పూర్వకంగా కలసి గ్రంధాలయ అభివృద్ధి కి సహకరించాలని కోరారు.అనంతరం శాశ్వత గ్రంథాలయాల భవనాలు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసిన ప్రభుత్వానికీ ధన్యవాదాలు తెలియజేశారు.త్వరలోనే భవనాలు పనులు చేపడతామని తెలిపారు.మున్సిపల్ బకాయిలు ను చెల్లించి గ్రంధాలయ ల అభివృద్ధికి సహకరించాలి అని మాజీ డిప్యూటీ స్పీకర్ కోనా రఘుపతి దృష్టికి తీసుకు రాగా ఆయన సానుకూలంగా స్పందించారు అని ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ బత్తుల దేవానంద్ పేర్కొన్నారు..

Related Posts

You cannot copy content of this page