తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల సంబురాలు అంబరాన్ని తాకేలా నిర్వహించాలి.

Spread the love

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల సంబురాలు అంబరాన్ని తాకేలా నిర్వహించాలి.

  • రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల సంబురాలు అంబరాన్ని తాకేలా నిర్వహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. బుధవారం నగరపాలక సంస్థ మున్సిపల్‌ సమావేశ మందిరంలో జూన్‌ 2 నుండి 21 రోజుల పాటు నగరంలో దశాబ్ధి వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ కలసి మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి వేడుకలను 21 రోజుల పాటు నిర్వహించే విధంగా రోజువారీ కార్యక్రమాలను రూపొందించిందన్నారు. ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదిఏళ్లుగా సాధించిన విజయాలను ఇంటింటికీ తీసుకువెళ్లేలా రూపొందించిన ప్రణాళికను ఆయన నివేదించారు.

తెలంగాణా రాష్ట్రము ఆవిర్బవించి తొమ్మిది ఏళ్ళు పూర్తి చేసుకుని పదో ఏట అడుగిడుగుతున్న సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వము జూన్‌ 2 నుండి 22 వరకు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమేనని ఈ క్రమంలోనే దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లను ఆయా డివిజన్ల కార్పొరేటర్‌లు అధికారులు సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. జూన్‌ 2వ తేదీన నుండి జరుగనున్న ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ విధిగా పాల్గొనాలని సూచించారు. ఇలాంటి అవకాశం మనకు దక్కడం గర్వకారణమన్నారు. మనకు వచ్చిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఅర్‌ పాలనలో తొమ్మిదేళ్లుగా జరిగిన ప్రగతి కొండంత అని కానీ మనం చెప్పుకునేది గోరంత అని ఆయన చెప్పారు. మీ డివిజన్‌ ల పరిధిలో జరిగే ప్రతి కార్యక్రమంలో వెయ్యి మందికి పైగా హాజరుకావాలని, ప్రతి కార్యక్రమంలో శాఖహార, మాంసాహార భోజనాలు తప్పక ఏర్పాటు చేయాలన్నారు.
ఈ సందర్భంగా ఖమ్మంలో జరిగిన అనేక అభివృద్ది పనుల నాడు – నేడు పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు.
జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలు ఖమ్మం మున్సిపల్‌ పరిధిలో ఘనంగా జరుపుకోవాలని కార్పొరేటర్‌ లు, స్థానిక ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి విజయవంతం చేయాలనీ కోరారు. మున్సిపల్‌ పరిధిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలిసేవిధంగా డాకుమెంటరీ చేయాలనీ అన్నారు. నగరపాలక సంస్థ కమీషనర్‌ ఆదర్శ్‌ సురభి, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌ కుమార్‌, మున్సిపల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ మల్లీశ్వరి, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page