డిగ్రీలో సత్తా చాటిన (ఓబిఎస్) ఒమేగా బిజినెస్ స్కూల్ విద్యార్థులు

Spread the love

సాక్షిత ఉప్పల్: ఇటీవలే నిర్వహించిన డిగ్రీ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి అందులో ఉప్పల్ పరిధిలోని హబ్సిగూడ
(ఓబిఎస్) ఒమేగా బిజినెస్ స్కూల్ విద్యార్థులు వారి మార్కులతో అందరితోనూ శభాష్ అనిపించుకున్నారు. బీకాం విద్యార్థి ఎస్ ఆయుష్ మిశ్రా కంప్యూటర్ అప్లికేషన్స్ లో 9.28% జీపీఏ, బిబిఏ విద్యార్థులు శ్రీకాంత్, ఉమాదేవి 9.24% జీపీఏ, తేజావత్ 9.16% జిపిఏ ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృష్ణ కవిత, లెక్చరర్లు జోసెఫ్ జాన్, విశ్వనాథ్ శర్మ, రామకృష్ణారెడ్డి, శివకుమార్, తేజస్వి, శామ్యూల్, కళాశాల సిబ్బంది కృష్ణమూర్తి, శ్రీధర్ రెడ్డి, సౌజన్య, శ్రీమణి ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page