బాలికల వసతి గృహాన్ని ప్రారంభించిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

Spread the love

ప్రచురణార్థం
తేది 15.05.2023

అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో బాలికల వసతి గృహాన్ని ప్రారంభించిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

రూ.7.35 కోట్లతో సకల హంగులతో వసతి గృహం ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.

అనంతరం విద్యార్థులతో ముఖముఖి నిర్వహించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.

వ్యవసాయ రంగానికి సంబంధించిన విద్యాబోధన, మౌలిక సదుపాయాల కల్పన, పరిశోధన, విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్ర రావణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.

సోమవారం అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం అనుబంధ వ్యవసాయ కళాశాలలో రూ.7.35 కోట్లతో రెండు అంతస్తులతో అన్ని సౌకర్యాలతో 55 గదులతో నూతనంగా నిర్మించిన బాలికల హాస్టల్ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖీ మాట్లాడుతూ వ్యవసాయ విద్యను ఎంపిక చేసుకున్న విద్యార్థులను మంత్రి అభినందించారు.

వ్యవసాయ రంగాన్ని విద్యగా ఎంచుకోవడం దేశ ప్రగతిలో భాగస్వాము కావడమేనని చెప్పారు. మనం చేస్తున్న సేవ దేశానికి చేస్తున్న సేవ లాంటిదని, దేశాన్ని కాపాడే సైనికుడికి కూడా అన్నం పెట్టే విద్యను మనం చేస్తున్నామని అన్నారు.

తాను కూడా ఎమ్మెస్సి అగ్రికల్చరల్ విద్యానభ్యసించానని, విద్యలో గోల్డ్ మెడల్ సాధించిన విషయం ఆయన గుర్తు చేశారు. వ్యవసాయంపై ఎంతో మక్కువతో ఈ రంగాన్ని ఎంచుకున్నానని, వ్యవసాయ పట్టభద్రుడనైన నేను నేడు ఈ కళాశాలకు రావడం
నా సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని, మీతో నా అనుభవాలు పంచుకోడం చాలా సంతోషమని చెప్పారు.

మంత్రి హోదాలో వ్యవసాయ కళాశాలలో ఇంత మంచి కార్యక్రమం నా చేతుల మీదగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

30 ఏళ్ల క్రితం అగ్రికల్చరల్ కోర్స్ ను ఎంపిక చేసుకున్నపుడు నా స్నేహితులు కొందరు వద్దు అన్న సందర్భాలు ఉన్నాయని, నాకు ఉన్న ఇష్టం, మక్కువతో వ్యవసాయ విద్యలో పిజి పూర్తి చేయడం గర్వంగా అనిపించిందన్నారు.

వ్యవసాయంలో విస్తరణ జరగాలని అప్పుడే అనేక కల్పనలు చేయడం జరిగిందని, ముఖ్యమంత్రి కేసీఅర్ సాకారం చేసి చూపించారని పేర్కొన్నారు.

వ్యవసాయాన్ని కేసీఅర్ విస్తరించారని రైతులకు అనేక సదుపాయాలు, ఉచిత విద్యుత్, ఎరువులు, విత్తనాలు, అందిస్తూ రైతు బంధు, రైతు భీమా సదుపాయాలు కల్పించి వ్యవసాయాన్ని కన్న
బిడ్డలా చూసుకుంటున్నారని వివరించారు.

కోట్లు రూపాయలను వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా రైతులకు అందిస్తున్నారని చెప్పారు. వ్యవసాయ విద్యార్థులుగా అంతకంటే ఏం కావాలని, ఇది మనకు గర్వకారణం అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేసిన విషయం గుర్తు చేశారు.

వ్యవసాయ విద్యార్థుల సౌకర్యార్థం రూ.7.35 కోట్లతో అత్యాధునిక హంగులతో వసతి గృహం నిర్మించడం జరిగిందన్నారు.

వ్యవసాయ విద్యను ఇష్టంతో పూర్తి చేసి మంచి వ్యవసాయ అధికారులుగా అన్నం పెట్టే రైతులకు మీ అమూల్యమైన సలహాలు సూచనలు, సేవలు అందించాలని, వ్యవసాయాన్ని మరింత అభివృద్ది చెందేలా చేయాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో
జిల్లా కలెక్టర్ అనుదీప్, జిల్లా ఎస్పీ డా వినీత్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్,
డిఎస్ఏ జల్ల శ్రీనివాస్ రావు, అసిస్టెంట్ డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డా హుస్సేన్, ప్రొఫెసర్ గోపాల కృష్ణ మూర్తి, విద్యుత్ శాఖ ఎస్ ఈ రమేష్, ఉద్యాన అధికారి మరియన్న, డిఆర్డీఓ మధుసూదన్ రాజు, ఎస్టేట్ ఆఫీసర్ మోహన్ రెడ్డి, జడ్పిటిసి పైడి వెంకటేశ్వర రావు, ఎంపిపి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page