మహనీయుల విగ్రహాల ఆవిష్కరించిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

Spread the love

మహనీయుల విగ్రహాల ఆవిష్కరించిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
వచ్చే ఎన్నికల్లో సతీష్ కుమార్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చిన మంత్రి


సాక్షిత – సిద్దిపేట బ్యూరో చీఫ్ :
హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలోని ప్రజా గ్రంథాలయంలో మహనీయులు మహాత్మా జ్యోతిభాపూలే, శ్రీమతి సావిత్రిబాయి పూలే దంపతులు మరియు ఆచార్య జయశంకర్ విగ్రహాలను పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్ కుమార్ హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ లు ఆవిష్కరించారు. అనంతరం శ్రీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ
అణగారిన వర్గాల కోసం, సమ సమాజపు స్థాపనకు పాటుపడుతూ సమాజం అభివృద్ది చెందాలని ఎంతో శ్రమించిన మహానీయుడు జ్యోతిబాపూలే అని మహిళా అభ్యున్నతికై కృషి చేసిన సంఘసంస్కర్త చదువుల తల్లి తొలి మహిళా ఉపాధ్యాయురాలు బిసిల మహిళల హక్కుల గొంతుక సావిత్రిబాయి పూలే అని అన్నారు.

రాష్ట్ర సాధన కోసం తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేసి ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు స్వరాష్ట సాధనకు నిరంతరం పరితపించి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, అసమానతలను ఎత్తిచూపుతూ తెలంగాణ ప్రజలలో చైతన్య దివిటీ వెలిగించిన గొప్ప మేధావి ఆచార్య జయశంకర్‌ అని ఆయ‌న సేవ‌ల‌ను కొనియాడారు.

జయశంకర్ తెలంగాణ సమాజానికి ఎన్నటికీ స్ఫూర్తి ప్రధాతగానే నిలుస్తారన్నారు. ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న‌కు జ‌య‌శంకర్ చేసిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని, వ్య‌వ‌య‌సాయ యూనివ‌ర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టుకున్నామ‌ని, రాష్ట్ర వ్యాప్తంగా ఆయ‌న విగ్ర‌హాల‌ను ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం అని అన్నారు. స్వ‌రాష్ట్రంలో నీళ్లు.. నిధులునియామకాలు అనే తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాయన్నారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ మా తమ్ముడు మంచి మనిషి కార్యదీక్షాపరుడు నిరంతరం అభివృద్ధి గురించి ఆలోచించే నాయకుడు హుస్నాబాద్ నియోజకవర్గానికి దొరకడం హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం అని సతీష్ కుమార్ తండ్రి కెప్టెన్ లక్ష్మీ కాంతారావు గొప్ప మనసున్న వారని నన్ను ఎప్పుడు కలిసిన గ్రామాల అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని కోరుతుంటారని వారు పంపిన ప్రతిపాదనలు అన్నిటికీ నిధులను ఇస్తానని హామీ ఇస్తున్నానన్నారు.

ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలని తాపత్రయపడుతూ ఉంటారు అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం కచ్చితంగా వస్తుందని అలాగే హుస్నాబాద్ నియోజకవర్గంలో మా తమ్ముడు ఎమ్మెల్యే సతీష్ కుమార్ భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డా. సుధీర్ కుమార్,కరీంనగర్ సుడా చైర్మన్ జీ.వి రామకృష్ణారావు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ మరియు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page