రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ సాగరిక కుమార్తె మృతి.

Spread the love

సాగరికకు, ఆమె భర్తకు, కుమారునికి తీవ్ర గాయాలు.

ఒంగోలు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.

ప్రమాద స్థలంలోనే మృతి చెందిన సాగరిక కుమార్తె ప్రియా.

మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ పిచ్చిక సాగరిక ఒంగోలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. సాగరిక కుమార్తె ప్రియ(6) మృత్యువాత పడ్డారు. కుమారుడికి, ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

రాత్రి శ్రీకాకుళం నుంచి కడపలోని రైల్వే కోడూరు స్వగ్రామానికి సాగరిక కుటుంబ సభ్యులు బయలుదేరారు. ఉదయం 7:15 గంటలకు ఒంగోలు వద్దకు చేరుకునే సరికి ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సాగరిక భర్త శివ సురేంద్ర డ్రైవింగ్ చేస్తూ నిద్ర మత్తులోకి జారు కోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

Related Posts

You cannot copy content of this page