బిజిగిర్ షరీఫ్ దర్గా లో ప్రత్యేక ప్రార్థనలు

Spread the love

NSUI తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Dr. బల్మూరి వెంకట్ హుజురాబాద్ నియోజికవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించాలని కోరుతూ NSUI కరీంనగర్ జిల్లా ప్రధనకార్యదర్శి ఎం.డి ఇమ్రాన్ ఆధ్వర్యంలో బిజిగిర్ షరీఫ్ దర్గా లో ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది….

ఆగస్టు 26, కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని బిజిగిరి షరీఫ్ దర్గా లో ప్రత్యేక పూజలు చేసిన కాంగ్రెస్ యువ నాయకులు

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ ఎమ్మెల్యే టికెట్ యువ నాయకుడైన NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మురి వెంకట్ గారికి కేటాయిస్తే, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని అసెంబ్లీకి పంపుతారని తెలిపారు ..
గతంలో తాను ప్రజలకు, విద్యార్థులకు,నిరుద్యోగులకు చేసిన సేవా కార్యక్రమాలు, మరియు కరోన సమయంలో ప్రభుత్వంతో కొట్లాడి విద్యార్థులకు అండగా నిలబడడం జరిగింది… మరియు హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక తర్వాత నియోజికవర్గంలో ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ తన వంతు సహాయం చేయడం జరిగింది….
ఇలా రాబోయే కాలంలో హుజురాబాద్ నియోజికవర్గం ఇంకా అభివృద్ధి దిశగా వెళ్ళాలంటే యువ నాయకుడైన వెంకట్ గారిని ఎమ్మెల్యే గా గెలిపించుకుని నియోజికవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం మన అందరి బాధ్యత అని తెలిపారు…
ఈ కార్యక్రమంలో NSUI కరీంనగర్ జిల్లా ప్రధనకార్యదర్శి ఎం.డి ఇమ్రాన్, NSUI హుజురాబాద్ నియోజకవర్గ నాయకులు ఎం.డి పర్వేజ్ ,ఎం.డి జియాఉల్ అలీ,ఎం.డి అర్షద్, యాసిన్, తౌఫిక్ ఎం.డి అజ్మత్,బబ్బు, ఫాయాజ్,సమీర్, అభిలాష్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు….

Related Posts

You cannot copy content of this page