సిఈఐఆర్ విధానంతో పోయిన మొబైల్స్ ని గుర్తించవచ్చు – యస్.పి అపూర్వ రావు

Spread the love

నల్గొండ టూ టౌన్ పరిధిలో పోగొట్టుకున్న యాభై ఫోన్లు బాధితులకు అందజేత
–www.ceir.gov.in పోర్టల్ పై ప్రత్యేక అవగాహన
నల్లగొండ సాక్షిత ప్రతినిధి

నల్లగొండ 2 టౌన్ పరిధిలో పోగొట్టుకున్న,చోరికి గురైన మొబైల్ ఫోన్లను జిల్లా పోలీస్ కార్యాలయంలో 50 మంది బాధితులకు జిల్లా యస్.పి అపూర్వ రావు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా యస్.పి మాట్లాడుతూ పోయిన లేదా దొంగలించబడిన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి సిఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ వెబ్ సైట్ లో సంబంధిత వివరాలను నమోదు చేసుకున్నట్లైతే అలాంటి మొబైల్స్ ను ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుంది అని తెలిపారు.ఈ పోర్టల్ నిర్వహణకు సంబంధించి అన్ని పోలీస్ స్టేషన్ల లో అధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ పోర్టల్ యొక్క ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పింస్తున్నామని, ఎవరైతే వినియోగదారులు వారి పోయిన మొబైల్స్ వివరాలను ఈ రిపోర్టర్ లో నమోదు చేసుకోవడం వల్ల సులువుగా గుర్తించడం జరుగుతుంది అని తెలిపారు. సిఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ ద్వారా కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖా ఆద్వర్యంలో సిఈఐఆర్ విధానాన్ని ప్రవేశపెట్టింధి.ఇందుకోసం www.ceir.gov.in వెబ్ సైట్ లో లాగిన్ కావాలి. అందులో రెక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్/స్టోలెన్ మొబైల్ లింక్ కనబడుతుంది. దానిపై క్లిక్ చేయాలి పోయిన చరవాణి లోని నంబర్లు,ఐఏంఇఐ నంబర్లు, కంపెనీ పేరు, మోడల్, కొన్న బిల్లు అప్లోడ్ చేయాలి. మొబైల్ ఏ రోజు ఎక్కడ పోయింది, రాష్ట్రం, జిల్లా, పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వివరాలు నమోదు చేయాలి. చివరగా వినియోగదారుడి పేరు, చిరునామా, గుర్తింపు కార్డు, ఈ-మెయిల్ ఐడి, ఓటిపి (ఓటిపి) కోసం మరో చరవాణి నెంబర్ ఇవ్వాలి. ఇదంతా పూర్తయిన తర్వాత ఒక ఐడి నెంబర్ వస్తుంది సంబంధిత ఐడి ఫోన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. మొబైల్ ఏ కంపెనీ అయినా సీఈఐఆర్ విధానం ద్వారా ఫోన్ పని చేయకుండా చేస్తుంది. చరవాణి దొరికిన తర్వాత వినియోగదారుడు అదే వెబ్ సైట్ వెళ్లి ఆన్ బ్లాక్/ఫౌండ్ మొబైల్ అనే లింక్ పై క్లిక్ చేయాలి. ఐడి నమోదు చేయగానే ఫోన్ అన్ బ్లాక్ అవుతుంది. చరవాణి పోయిన వెంటనే తమ పరిధిలోని పోలీసులకు సమాచారం అందించాలని సిఈఐఆర్ పోర్టల్ ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా సాంకేతికను ఉపయోగించి మొబైల్ ఫోన్లను వెతికి పట్టుకొని ఉత్తమ ప్రతిభ కనబరిచి 2 టౌన్ యస్.ఐ రాజశేఖర్ రెడ్డి, సిబ్బంది బాలకోటి, శంకర్లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రొబేషనరీ ఐపిఎస్ శేషాద్రిని రెడ్డి, అడిషనల్ యస్.పి కె.ఆర్.కె ప్రసాద రావు,నల్లగొండ డి.యస్.పి నల్లగొండ డిఎస్పి నరసింహారెడ్డి, యస్. ఐ రాజశేఖర్ రెడ్డి,సిబ్బంది బాలకోటి,శంకర్ పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page